బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మరో విషాదం

brs-worker-shot-dead-due-to-heart-attack-at-yadadri-athmiya-sammelanam

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందగా , తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడిలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఓ కార్యకర్త గుండెపోటుకు గురై కన్నుమూశాడు.

వివరాల్లోకి వెళ్తే..

సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కార్యకర్తలను , ప్రజలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని అనుకోని విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడిలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంచల తండాకు చెందిన కార్యకర్త ధీరావత్ నాను సింగ్ గుండెపోటుతో మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో.. ప్రాథమిక చికిత్స అందించకుండా … ఆయ‌నను ఆసుపత్రికి త‌ర‌లిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ధీరావత్ నాను సింగ్ కు ముగ్గురు ఆడపిల్లలు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడం తో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.