టీడీపీ మహానాడు సభ కు వచ్చిన వారికీ గోదావరి రుచులు

ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహానాడు వేడుకలను అట్టహాసంగా జరిపేందుకు టీడీపీ సిద్ధమైంది. వేమగిరి వద్ద నిర్వహించనున్న మహానాడు స్థలాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల సుబ్బరాజు తదితరులు స్థలాన్ని పరిశీలించి , సమీక్షా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహానాడు తొలి రోజు ప్రతినిధుల సమావేశానికి లక్షమంది, తర్వాతి రోజు బహిరంగ సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్టు చెప్పారు. వీరిందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, విందులో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన అన్ని రకాల వంటకాలు వడ్డిస్తామన్నారు.
దివంగత ఎన్టీఆర్ భోజన ప్రియుడు కావడంతో ఆయన శతజయంతి ఉత్సవాల్లో గోదావరి రుచులు వడ్డించాలని టీడీపీ నిర్ణయించింది.