బజరంగ్ దళ్‌ను గూండాల సమూహంగా అభివర్ణించిన కాంగ్రెస్ నేత

కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్‌ దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొనడం వివాదాస్పదమైంది. తాజాగా అందులోకి హిందూత్వను కూడా చేరుస్తూ ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని జగదల్‌పూర్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. హిందూత్వ అనేది ధర్మం కాదని అన్నారు. ఆ పేరుతో దాడులకు పాల్పడడాన్ని తాము అంగీకరించబోమన్న ఆయన.. బజరంగ్‌ దళ్‌ను గూండాల గ్యాంగ్‌గా అభివర్ణించారు. మనది సనాతన ధర్మమని, హిందుత్వను తాము ధర్మంగా పరిగణించబోమని స్పష్టం చేశారు. హిందుత్వ అంటే తమతో ఏకీభవించని వారిపై కర్రలతో దాడిచేయడం, ఇళ్లు కూల్చేయడం, డబ్బు దోచుకోవడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.