బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ నియామకం

Former Telangana BJP president Bandi Sanjay appointed as party’s national general secretary.

న్యూఢిల్లీ: తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను.. పార్టీ అధిష్ఠానం జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. బండి సంజయ్‌ను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. కమల అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా,తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కొసం బిజెపి అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. బిజెపి పార్టీకి తెలంగాణలో ఒక ఊపు తెచ్చిన బండి సంజయ్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించడంపై చాలా మంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. అయితే బండి సంజయ్‌కు మరో పదవి ఇస్తారని ఇటీవల జోరుగా ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.