కరోనాను ఎదుర్కోవడానికి రూ. 100 కోట్లు

కరోనా గురించి ఆందోళన చెందవద్దు..సిఎం కెసిఆర్‌

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందిస్తున్నామని… ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని సిఎం కెసిఆర్‌ తెలిపారు. కరోనా మహమ్మారి గురించి ఎవరూ ఆందోళన చెందవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ మందికి చికిత్స అందుతోందని అన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం గందరగోళంలో ఉండేదని… అదే సమయంలో తెలంగాణలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని తెలిపారు. కరోనాతో సహజీవనం చేయక తప్పదని అన్నారు. తెలంగాణలో ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడానికి రూ. 100 కోట్లను కేటాయించామని సిఎం కెసిఆర్‌ తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/