బ్రెజిల్లో ఒక్కరోజే 1,299 మంది కరోనాతో మృతి
మొత్తం కేసుల సంఖ్య 20,14,738
బ్రసిలియా: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తుంది. బ్రెజిల్లో కరోనా కేసులు ఇరవై లక్షలు దాటాయి. దేశంలో గురువారం కొత్తగా 43,829 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,14,738కి చేరింది. నిన్న ఒకేరోజు 1,299 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మరణాలు 76,822కు పెరిగాయి. దేశంలో మొదటి కరోనా కేసు మే నెలలో నమోదయ్యింది. కేవలం మూడు నెలల్లోనే ఈ సంఖ్య 20 లక్షలు దాటింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 571141 కేసులు యాక్టివ్గా ఉండగా, 13,26,775 మంది కోలుకున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/