తిరుమల కొండ ఫై హీరోయిన్ కు ‘కిస్’ పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్

ఆదిపురుష్ డైరెక్టర్ ఓం..మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండ ఫై పబ్లిక్ గా హీరోయిన్ కు కిస్ పెట్టి వార్తల్లో నిలిచారు. ప్రభాస్ – కృతి సనన్ జంటగా ఓం డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఈ నెల 16 న పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా మంగళవారం తిరుపతి లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. బుధువారం డైరెక్టర్ ఓం తో పాటు హీరోయిన్ కృతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇక దర్శనం పూర్తి చేసుకొని కృతి వెళుతుండగా ఓం రౌత్ ఆమె దగ్గరకు వెళ్లి.. కృతిని హగ్ చేసుకొని, ఆమె చెంపపై ముద్దు (పెక్) పెట్టారు. ‘గాడ్ బ్లెస్ యూ’ అంటూ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. ఇది కాస్త వైరల్ కావడం తో శ్రీవారి భక్తులు ఓం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో పెక్ చేయడం, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కామనే అయుండొచ్చు కానీ.. తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి ఆలయ ఆవరణలో పేక్, హగ్ లాంటివి చేయడం సరైన పద్ధతి కాదంటూ వారిపై మండిపడుతూ… దీనిపై ఓం రౌత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఓం రౌత్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

మరోపక్క ఆదిపురుష్ సినిమాను ఫ్రీగా చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు పదివేల ప్లస్ టికెట్లను ఉచితంగా ఇస్తామని ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు.

దీనికోసం గూగుల్ ఫామ్ నింపితే టికెట్లు నేరుగా మేము పంపిస్తామని అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు. ” శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం, ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగుజాడలను అనుసనరించాలి… జై శ్రీరామ్ కీర్తనలు నలువైపులా ప్రతిధ్వనించాలి” అని ఆయన ట్వీట్ చేశారు.