4వ విడత వారాహి యాత్ర ఫుల్ షెడ్యూల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుండగా, కృష్ణ జిల్లాలోని అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ లో మధ్యాహ్నం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.
అక్టోబర్ 2వ తేదీన కృష్ణ జిల్లాలోని జనసేన నాయకులతో భేటీ అయ్యి రాజకీయ పరిస్థితులు మరియు ఎన్నికల వ్యూహాల గురించి చర్చించనున్నారు. అక్టోబర్ 3న జనవాణి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.. అక్టోబర్ 4న పెడన లో పర్యటించనుండగా , అక్టోబర్ 5న కైకలూరు లో పర్యటిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో మూడు దశలుగా పూర్తయిన వారాహి విజయయాత్ర 4వ దశలో కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు సాగనుంది.