జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణపై నిర్ణయం తీసుకోనున్న కోర్టు

CM Jagan shocked by Jayaprakash Reddy death
CM Jagan

హైదరాబాద్‌: ఏపి సిఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో రేపటికి వాయిదా పడింది. కాగా, గత శుక్రవారం ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నేటికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగింది. అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న కోర్టు విచారించనుంది. ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని ఏపీ సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టును కోరారు. అయితే, దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/