దుబ్బాక ఉపఎన్నికలో కూడా ఇవే ఫలితాలొస్తాయి
ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్దే..మంత్రి హరీశ్ రావు
మెదక్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..ఉమ్మడి నిజామబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిందని, దుబ్బాక ఉపఎన్నికలో కూడా ఇవే ఫలితాలొస్తాయని మంత్రి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట వైస్ ఎంపీపీ, బిజెపి నేత రామచంద్రం మంత్రి సమక్షంలో టిఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిల డిపాజిట్లు గల్లంతయ్యాయని చెప్పారు. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో కాంగ్రెస్, బిజెపిల గోబెల్స్ ప్రచారాలు, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని రుజువయ్యాయని చెప్పారు. మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి జీహెచ్ఎంసీ.. ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదే అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/