దేశంలో త‌గ్గుముఖం ప‌డుతోన్న క‌రోనా కేసులు


మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,75,044
మొత్తం మృతుల సంఖ్య 3,31,895

న్యూఢిల్లీ: భారత్ లో కొత్త‌ క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దేశంలో నిన్న 1,27,510 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం… నిన్న 2,55,287 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,75,044కు చేరింది. మరో 2,795 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,31,895కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,59,47,629 మంది కోలుకున్నారు. 18,95,520 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,67,92,257 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,25,374 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/