సౌదీలో ఒక్కరోజే 4,919 కొత్త కేసులు
మొత్తం కేసులు సంఖ్య 1,41,234
రియాధ్: సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజు భారీగా పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సౌదీలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్కును దాటాయి. బుధవారం కూడా 4,919 కొత్త కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ సౌదీలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,41,234కు చేరింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా రియాధ్ 2,371, మక్కా 282, జెడ్డా 279, హుఫోఫ్ 273 తదితర ప్రాంతాల్లో నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/