భారత్లో ఒక్కరోజే 7,466 కొత్త కేసులు
మొత్తం కరోనా కేసులు 1,65,799..మొత్తం మృతుల సంఖ్య 4,706
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 7,466 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 175 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,65,799కి చేరగా, మృతుల సంఖ్య 4,706 చేరుకుంది. 89,987 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 71,106 మంది కోలుకున్నారు. ఈమేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/