అక్టోబర్‌ 7 న 52వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

GST Council to meet on October 7

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన అక్టోబర్‌ 7వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 52వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా వెల్లడించింది. అయితే, ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారో మాత్రం వెల్లడించలేదు. మరోవైపు 51వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఆగస్టు 2వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.