భారత్లో 70 వేలకు చేరిన కరోనా కేసులు
గత 24 గంటల్లో 87 మంది మృతి..కరోనా కేసుల సంఖ్య మొత్తం 70,756

న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోన్నాయి. దేశంలో గత 24 గంటలో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,293కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 3,604 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 70,756కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 22,454 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 46,008 మంది చికిత్స పొందుతున్నారు. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు విడుదల చేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/