ఆప్ పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందారు
అరవింద్ కేజ్రీవాల్ ఆలోచన సరైనదే
న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందారని అందుకే తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేశారని ఆప్ సీనియర్ నేత గత కేబినేట్లో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అబివృద్ధి కార్యక్రమాల అమలులో మంత్రులు కీలక పాత్ర పోషించరన్నారు. తిరిగి పాత కేబినెట్నే ఎన్నకోవాలనుకున్న కేజ్రీవాల్ ఆలోచన సరైందనే అని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రుల పనితీరుతో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మా పనితీరు ఆధారంగానే ఎన్నికల్లో గెలిచామని తెలిపారు. ప్రజలు విశ్వాసాన్ని ఎమాత్రం వమ్ము కానివ్వబోం అని సిసోడియా వ్యాఖ్యానించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరుగులేని విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/