ఎనిమిదో సారి సిఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం
డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణం
పాట్నాః బిహార్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ నితీశ్కుమార్తో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈరోజను ప్రమాణస్వీకారం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/