ఎనిమిదో సారి సిఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణం

Nitish Kumar takes oath as Bihar CM for the 8th time

పాట్నాః బిహార్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఫగు చౌహాన్‌ నితీశ్‌కుమార్‌తో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేశారు. బీజేపీ, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈరోజను ప్రమాణస్వీకారం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/