భారత్లో కరోనా విజృంభణ
ఒక్కరోజులోనే 1,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేవలం ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 1,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 13,387 కు చేరుకున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా 437 మంది మరణించారు. దేశావ్యాప్తంగా 1,749 మంది దీని బారి నుండి కోలుకోగా.. 11,201 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరు 3,205 మందికి ఇక్కడ కరోనా పాజిటివ్ సోకగా.. 194 మంది మృతి చెందారు. తెలంగాణలో 700 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్లో 534 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/