ఏపిలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు
572 కు చేరిన భాధితుల సంఖ్య

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి జరిపిన పరీక్షల్లో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులొకి వచ్చాయి అని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 572 కు చేరుకుంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దీని బారీన పడి 14 మృతి చెందారు. మరో 35 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 523 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా అత్యధికంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 126 కరోనా పాజిటివ్కేసులు నమోదు కాగా.. నెల్లూరు జిల్లాలో 64 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/