24 మంది తాలిబ‌న్‌లు హ‌తం

taliban

కాబూల్‌: జ‌బుల్ ప్రావిన్స్‌లోని అర్ఘన్‌దాబ్‌, షింక్జాయ్‌, షా జోయ్ జిల్లాల్లో ఆఫ్ఘనిస్థాన్ సైనికులకు, తాలిబ‌న్‌ల‌కు మ‌ధ్య జ‌రిగిన వేర్వేరు ఎదురు కాల్పుల్లో మొత్తం 24 మంది తాలిబ‌న్‌లు హ‌త‌మ‌య్యారు. మ‌రో మంది తాలిబ‌న్లు గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘనిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌క‌ట‌న‌పై తాలిబ‌న్‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స్పంద‌న తెలియ‌జేయ‌లేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/