శరద్ పవార్‌కి ఈసీ షాక్

కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్‌దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ పార్టీ పేరు, గడియారం గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వార్త అజిత్‌ పవార్‌ వర్గానికి అతిపెద్ద ఉపశమనంగా కలిగించింది.

ఎన్సీపీ పార్టీ బాధ్యతలు అజిత్ పవార్‌కి మాత్రమే ఉన్నాయి.. మరోవైపు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా శరద్ పవార్ గ్రూపునకు ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతినిచ్చింది. శరద్ పవార్ గ్రూపు ఇప్పుడు కొత్త గుర్తు కోసం ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది. దీనికోసం రేపు 4 గంటల వరకే ఈసీ డెడ్‌లైన్‌ విధించింది.