కరోనాపై రేపు సిఎం కెసిఆర్ సమీక్ష
ఆర్టీసీ సేవల పునరుద్ధరణ తదితర అంశాలపైనా ఉన్నతాధికారులతో చర్చ
హైదరాబాద్: సిఎం కెసిఆర్ రేపు ఉదయం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈసమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 29 వరకూ లాక్ డౌన్ అమలులో ఉండనుంది. తాజా పరిణామాలను చర్చించనున్న కెసిఆర్, దానిని యథాతథంగా అమలు చేసేందుకే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఆర్టీసీ సేవల పునరుద్ధరణ తదితర అంశాలపైనా ఉన్నతాధికారులతో కెసిఆర్ చర్చించనున్నారని సమాచారం. ఇక ఇదే సమయంలో మధ్యాహ్నం తరువాత సమగ్ర వ్యవసాయ విధానంపైనా కెసిఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల వ్యవసాయ అధికారులతో పాటు రైతు బంధు సమితి ప్రతినిధులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/