నెల్లూరు పర్యటనకు సీఎం జగన్

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొననున్న జగన్

నెల్లూరు: సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి హెలికాప్టర్ లో బయల్దేరి నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ల్యాండ్ అయ్యారు. ఉదయం 11.50 గంటలకు నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్న సీఎం. 11.50 నుంచి 12.40 వరకు దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొంటారు. అనంతరం హెలిపాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్ లో రేణిగుంటకు పయనం. మధ్యాహ్నం 1.20 గంటలకు రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు పయనం. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన పయనించే మార్గంలో రాకపోకలను నిషేధించాలని పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/