మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడి 72,050కి పెరిగింది. నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 21,911 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకవ విలువ రూ.83.04 వద్ద కొనసాగుతుంది.