శ్రీకాకుళంలో రైలు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

ఐదుగురి మృతి.. రూ.2 లక్షల చొప్పున పరిహారం

అమరావతి : శ్రీకాకుళం జిల్లా బాతువ-చీపురుపల్లి మధ్య కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఐదుగురు మరణించారని తెలియడంతో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

కోయంబత్తూరు నుంచి సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు సాంకేతికలోపంతో శ్రీకాకుళం జిల్లాలో ఆగిపోగా, ప్రయాణికులు కొందరు కిందికి దిగారు. అయితే, వారు అవతలి వైపు పట్టాలపై నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/