ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత కొన‌సాగుతోంది. మ‌ళ్లీ బుల్డోజ‌ర్లు వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ద‌క్షిణ ఢిల్లీ మున్సిపాల్టీ ప‌రిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాల‌నీలో ఇవాళ ఉద‌యం భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత చేప‌ట్టారు. ద‌క్షిణ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కూల్చివేత డ్రైవ్ కొన‌సాగిస్తున్నారు. మే 4వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించ‌నున్నారు. నార్త్ ఢిల్లీ మున్సిపాల్టీ ప‌రిధిలోని మంగోల్‌పురిలో కూడా అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత కొన‌సాగుతోంది. అక్క‌డ కూడా బుల్డోజ‌ర్ల‌తో ప‌ని చేప‌ట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/