కడపలో రెండో రోజు జగన్ బిజీ బిజీ ..

ఏపీ సీఎం జగన్ కడపలో బిజీ బిజీ గా పర్యటిస్తున్నారు. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొననున్నారు. సుమారు మూడు గంటల పాటు సీఎం ప్రార్థనలో పాల్గొననున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12.30 గంటలకు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం చేరుకుంటారు.

మండల, ఎమ్మార్వో ఆఫీసు, పోలీసు స్టేషన్, రోడ్డు వైడనింగ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సాయంత్రం 3 గంటలకు తిరిగి ఇడుపులపాయ చేరుకుంటారు. ఇడుపులపాయలోని ఎకో పార్క్‌లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. గంటన్నర పాటు ఈ భేటీ జరగనుండా.. ఆ తర్వాత్రి ఈ రోజు రాత్రికి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు.