నేడు పులివెందులలో సీఎం జగన్ పర్యటన

నేడు కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ Govt Hospital ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు.

ఆ తర్వాత డాక్టర్‌ వైఎస్సార్‌ జంక్షన్‌ వైస్సార్ జంక్షన్ కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌ ప్రారంభించిన తర్వాత వైఎస్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ చేరుకుని ప్రారంభిస్తారు. అలాగే గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌‌ను Lake Front ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్‌-1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.