ఇప్పటికే టిడిపికి చెందిన లక్ష ఓట్లు తొలగించారుః చినరాజప్ప
వాలంటీర్లతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆగ్రహం
అమరావతిః టిడిపి పార్టీ నేత చినరాజప్ప సిఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… జగన్ ప్రతిపక్షాలకు చెందిన 30 లక్షల ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన లక్ష ఓట్లను తొలగించారన్నారు. ఇప్పుడు వాలంటీర్లతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని, ఈ సమాచారాన్ని ప్రయివేటు సంస్థలకు ఇస్తున్నారని ఆరోపించారు.
ఓటరు పరిశీలనకు వాలంటీర్లను ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరించే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ప్రతిపక్షాల ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తున్నారన్నారు.