ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా
ఈ రోజు ఉదయం అప్పగింత ప్రక్రియ పూర్తి
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ యువకులను చైనా విడిచిపెట్టింది. ఆ ఐదుగురు వాస్తవాధీన రేఖను పొరపాటున దాటివెళ్లినట్లు చెబుతూ భారత ఆర్మీ ప్రకటన చేసింది. చైనా భూభాగంలో ఈ రోజు ఉదయం ఈ ప్రక్రియ జరిగింది. కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ కు ఆ ఐదుగురిని భారత సిబ్బంది తీసుకొచ్చారు. కాగా, ఇండో టిబెటన్ భద్రతా దశాలు స్థానికులను సహాయకులుగా వినియోగించుకుంటాయి. వారితో తమకు అవసరమైన సామగ్రిని తెప్పించుకుంటుంటాయి. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్లో సుబన్సిరి జిల్లాకు చెందిన ఐదుగురు దారి తప్పిపోయారు. దీంతో వెంటనే సరిహద్దుల వద్ద వారిని చైనా సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. మొదట తమకు వారి జాడ గురించి తెలియదన్న చైనా అనంతరం వారు తమ వద్దే ఉన్నట్లు ప్రకటించింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/