రాజకీయ పార్టీలకు భారీ షాక్ ఇచ్చిన సీఈఓ

ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ను గట్టిగా వాడుకుంటున్నాయి. తమ మేనిఫెస్టో లను ప్రచారం చేస్తూ..అవతలి పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఈఓ అన్ని రాజకీయ పార్టీలకు భారీ షాక్ ఇచ్చింది.

ఇకనుంచి పొలిటికల్ యాడ్స్ నిలిపివేయాలని మీడియాను ఈసీ ఆదేశించింది. అన్ని చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ లేఖలు రాశారు. లీడర్లు ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తూ తమకు కావాల్సినట్లు ప్రకటనలు తయారుచేసి ప్రచారం చేసుకుంటున్నారని ఈసీ అధికారులు గుర్తించారు.

అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈఓ అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు తమ ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తున్న కారణంగా పొలిటికల్ యాడ్స్ ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఓ లేఖలో పేర్కొంది. ఆ మేరకు మీడియా సంస్థలకు ఎన్నికల ప్రధానాధికారి లేఖ రాశారు.