రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఈ వారంలో రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. తమ వేతనాలను సవరించాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు సమ్మెకు దిగుతుండటంతో రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వేతనాల పెంపుపై ప్రధాన కార్మిక కమిషనర్తో తాజాగా ఉద్యోగ సంఘాలు జరిపిన చర్యలు విఫలమయ్యాయి. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన సమ్మె చేస్తున్నట్లు బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. కాగా తమ వేతనాలను 20% పెంచాలని బ్యాంకు ఉద్యోగులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/