నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

ap cabinet meeting

ఈరోజు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్​లో మద్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఇటీవలే జగన్ కొత్త మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి వర్గంలో పునః వ్యవస్థీకరణలో కొంతమంది కొత్తవారికి చోటు దక్కింది. అయితే.. మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర కేబినెట్‌ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది.

దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మ ఒడి పథకం గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రి వర్గ పునః వ్యవస్థీకరణ అనంతరం తొలి సమావేశం కావడంతో.. ఎవరెవరు.. ఏయే నిర్ణయాలు తెరపైకి తీసుకువస్తారని ఆసక్తి నెలకొంది.