యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ స్వీప్..వారణాసిలో ఓటమి

వారణాసిలో గెలిచిన మాఫియా డాన్ భార్య

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. యూపీ శాసనమండలిలో 100 సీట్లు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న 36 సీట్లకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ రోజు జరుగుతున్న కౌంటింగ్ లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. వీటిలో 30 సీట్లలో బీజేపీ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఈ ఫలితాలు అధికారికంగా వెలువడిన తర్వాత యూపీ శాసనమండలిలో సైతం బీజేపీ సభ్యులు భారీగా పెరగనున్నారు.

మరోవైపు ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి స్థానంలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. మాఫియా డాన్, స్థానికంగా ఎంతో పట్టు ఉన్న బ్రిజేశ్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ భారీ గెలుపొందారు. బ్రిజేశ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడం గమనార్హం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/