ఆచార్య ట్రైలర్ విడుదల

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగా స్టార్ చిరంజీవి కలయికలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కీలక రోల్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య. ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ ‘సిద్ధ’ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఆసక్తి నింపారు. ముందుగా ఈ మూవీ ట్రైలర్ ని 153 థియేటర్లలో చిత్ర బృందం సాయంత్రం 5:49 నిమిషాలకు విడుదల చేసారు. ఆ తర్వాత సోషల్ మీడియా లో రిలీజ్ చేసారు.

రామ్‌ చరణ్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే డ్యాన్స్‌, ఫైటింగ్‌లు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. మొన్నటి వరకు అభిమానులు కాస్త నిరాశలో ఉండగా..ఈ ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ లో చిరు కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా, చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది.

YouTube video