ఎల్‌కే అడ్వానీతో బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ భేటి

Bihar CM Nitish Kumar meet LK Advani

న్యూఢిల్లీః బిజెపి అగ్రనేత ఎల్‌కే అడ్వానీ ని బీహార్‌ ముఖ్యమంత్రి , జేడీయూ నేత నితీశ్ కుమార్ కలిశారు. అడ్వానీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పుస్కారం ‘భారత రత్న’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడ్వానీని నితీశ్‌ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్‌ కుమార్‌ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిజెపితో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారి ఆయన రాజధానిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. అదే సందర్భంలో రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలపై కూడా చర్చించినట్లు సమాచారం.