ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లినా.. టీడీపీకి ఏపీ ప్రజలు పట్టంకడతారు : అచ్చెన్నాయుడు

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 160 సీట్లు .. అచ్చెన్నాయుడు

atchannaidu

అమరావతి : టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికార వైస్సార్సీపీ నేతలు చేసిన ఛాలెంజ్ పై స్పందించారు. అధికార పార్టీ చేసిన ఛాలెంజ్ లో భాగంగా ముందస్తు ఎన్నికల కు వెళదామని చెప్పారు. అంతేకాదు ఎన్నికలు ఎపుడు వచ్చినా .. టీటీడీ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ ప్రభ్యుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది..వ్యతిరేకత పెరిగితే నష్టం జరుగుతుందని.. ముందుస్తుగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వం చేస్తుందంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూడా తోందర్లోనే ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నారు..తాము కూడా అదే భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లినా.. టీడీపీకి ఏపీ ప్రజలు పట్టంకడతారని.. 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము ఈ విషయం గుడ్డిగా చెప్పడం లేదని.. రాష్ట్రంలో ఆ పరిస్థితులు అలా ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏజెన్సీ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అందరికి తెలుసు.. ఆ ప్రాంతాలకు తాము కూడా వెళ్ళామని అచ్చెన్నాయుడు చెప్పారు. మావోయిస్టులు లేఖ వెనుక టీడీపీ ఉందని అంటారు. బాధ్యత ఉంది కనుక మావోయిస్టులు ప్రకటన చేశారు.. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రతి దానికీ టీడీపీ ఉందని ప్రభుత్వానికి చెప్పడం అలవాటు అయ్యిందని అన్నారు. చివరికి భార్యా భర్తలు సంసారం చేసుకోకపోయినా చంద్రబాబు కారణమని..వైస్సార్సీపీ నేతలు మాట్లాడతారంటూ వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/