ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం..
అమరావతి : ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 10.15 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టునున్నారు.
బడ్జెట్లో కేటాయింపులపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఏపీ ప్రజలు. శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రవార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా.. మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక, శాసనమండలిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సాధారణ బడ్జెట్ను, వ్యవయసాయ బడ్జెట్ను సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/