దేశంలో కొత్త‌గా 4,194 క‌రోనా కేసులు

మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,24,26,328

corona virus-india

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 4,194 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న‌ 6,208 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. అలాగే, క‌రోనాతో బాధ‌ప‌డుతూ నిన్న 255 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపింది.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 42,219 మంది చికిత్స తీస‌కుంటున్నారని వివ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 179.72 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. క‌రోనా నుంచి నిన్న 6,208 మంది కోలుకున్న‌ట్లు తెలిపింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,24,26,328గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/