మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ , రివార్డ్స్ అందుకున్న కేటీఆర్..తాజాగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వచ్చే నెల 16 నుంచి 20 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 2023 వార్షిక సదస్సుకు ఆహ్వానం అందింది.

ఈ సదస్సుకు యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు యోగి ఆదిత్యనాథ్, బసవరాజ్ బొమ్మై, ఏకనాథ్ షిండే, కేంద్ర మంత్రులు మాన్ సుక్ మాండవియా, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీలతో పాటు ముఖేష్ అంబానీ తదితర 100 మంది ప్రముఖులను ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానించింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ప్రతి ఏటా ఈ సదస్సుకు కేటీఆర్ హాజరవుతున్నారు. వచ్చే నెల 14న ఆయన సదస్సు కోసం బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.