నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ విందు..హాజరుకానున్న సీఎం కెసిఆర్
క్రిస్మస్ సందర్బంగా ఈరోజు తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ విందు ఏర్పటు చేయబోతున్నారు. ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందువ్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
క్రిస్మస్ విందులో 12 వేల మంది ప్రజలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పలువురికి సీఎం కేసీఆర్ పురస్కారాలు అందజేయనున్నారు. మరోవైపు క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు చూస్తే..
ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వారిని నాంపల్లి, చాపల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
అబిడ్స్, గన్ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్ఫౌండ్రీ నుంచి చాపల్రోడ్డు,స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
బషీర్బాగ్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు రూట్లో వచ్చే వాహనాలను కింగ్ కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డులోకి పంపిస్తారు.
సుజాత స్కూల్ లైన్ నుంచి ఖాన్ లతీఫ్ఖాన్ బిల్డింగ్ వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా ఆయా ప్రాంతాలకు మళ్లిస్తారు.