అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ముసలి ప్రత్యక్షం

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరోసారి ముసలి ప్రత్యక్షం కావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆలయంలో సరస్సు మరింత ప్రత్యేకం. గతంలో ఈ కొలనులో బబియా అనే మొసలి ఉండేది. ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ మొసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించింది. ఇప్పుడీ బబియా స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైంది.

ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది? అనేది మిస్టరీగా మారింది. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కొలనులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. అలా కనిపించిన వాటిలో బబియా అనే మొసలి మూడోవది. తాజాగా కనిపించింది నాలుగవది. ఒకప్పుడూ ఈ కొలనులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని బ్రిటిష్‌ వాళ్లు కాల్చేయగా దాని స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని.. మళ్లీ ఆ స్థానంలో మరో మొసలి రావడం అందరిని ఇప్పుడు షాక్‌కు గురి చేసింది. మరి ఈ ముసలి ఎక్కడి నుండి వచ్చింది..? అసలు ఈ కొలనులో ఎన్ని ముసళ్ల ఉన్నాయి..? అని అంత మాట్లాడుకుంటున్నారు.