పీఆర్సీపై 10 రోజుల్లో ప్రకటన: సీఎం జగన్
తిరుపతిలో కలిసిన ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి హామీ
![Announcement in 10 days on PRC: CM Jagan](https://www.vaartha.com/wp-content/uploads/2021/12/Announcement-in-10-days-on-PRC-CM-YS-Jagan-Mohan-Reddy.jpg)
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పదిరోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్ అన్నారు. తిరుపతి సరస్వతీ నగర్లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు ఆయన్ని కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేయగా ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/