వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్..వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులంటే సీఎం జగన్ కు ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు టీచర్లు ఉండాలా, వద్దా? వాళ్లు చేసిన తప్పేంటి? అని నిలదీశారు. సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ఉద్యోగులను మోసం చేశారని , టీచర్లపై రాజకీయ ఒత్తిడి తెచ్చి వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు.

ప్రతిదానికి ఉపాధ్యాయులను బలిచేస్తున్నారని, వారిని మనోవేదనకు గురిచేస్తున్నారని ఆగ్రహం ఆగ్రహం చేసారు. ఉపాధ్యాయులపై ఇకమీదటైనా ప్రభుత్వ వేధింపులు ఆపాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో ఉపాధ్యాయులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని వెల్లడించారు. 10వ పీఆర్సీ సమయంలో 4 శాతం పెంపుదలతో ఇచ్చామని స్పష్టం చేశారు.