తనపై వస్తున్న విమర్శల ఫై నటి శృతి హాసన్ కామెంట్స్

వాల్తేర్ వీరయ్య , వీరసింహారెడ్డి చిత్రాల్లో చిరంజీవి , బాలకృష్ణ ల సరసన నటించిన శృతి హాసన్ ఫై గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు. సీనియర్ హీరోల పక్కన ఎందుకు నటిస్తున్నారని , యంగ్ హీరోల ఛాన్సులు రావడం లేదా..ఇలా సీనియర్స్ పక్కన నటిస్తే ఎలా వస్తాయని విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో తన ఫై వస్తున్న ట్రోల్స్ , విమర్శలపై శృతి స్పందించింది.

చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ లెజెండ్స్ అని, అలాంటి వారితో నటించే అవకాశం వస్తే ఎందుకు కాదనాలని ప్రశ్నించింది. పైగా, మంచి పాత్రలు లభించాయని వెల్లడించింది. హీరోలకు, తనకు మధ్య వయసు వ్యత్యాసం పెద్దగా పట్టించుకోనక్కర్లేదని, అందరూ మాట్లాడుకునే బాలీవుడ్ లోనూ ఏజ్ గ్యాప్ ఉంటుందని శృతి తెలిపింది. తనను అందరూ ఇంకా చిన్న పిల్లలాగానే చూస్తున్నారని, అందుకు సంతోషిస్తున్నానని తెలిపింది. వయసు తేడా గురించి చేసే విమర్శలను తాను పట్టించుకోబోనని క్లారిటీ ఇచ్చింది.