35 మంది చైనా సైనికులు మృతి.. అమెరికా ఇంటలిజెన్స్

ప్రాణనష్టం వివరాలను చైనా దాచిపెడుతోందన ..అమెరికా మీడియా

ladakh galwan valley

వాషింగ్టన్‌: భారత్‌, చైనా జవాన్లు మధ్య ఘర్షణలో 35 మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నట్లు యూఎస్ న్యూస్.కామ్ మీడియా సంస్థ పేర్కొంది. అయితే తమ సైనికులు చనిపోవడాన్ని చైనా అవమానంగా భావిస్తోందని న్యూస్.కామ్ మీడియా సంస్థ పేర్కొంది. అందుకే మృతుల సంఖ్య వెల్లడించేందుకు విముఖత వ్యక్తం చేస్తోందని తెలిపింది. కాగా, మృతి చెందిన చైనా సైనిక సిబ్బందిలో ఒక సీనియర్ అధికారి కూడా ఉన్నాడని వెల్లడించింది.

ఇక, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చైనా వ్యవహారాల విభాగం నిపుణుడు టేలర్ ఫార్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాకులు, కాల్పులు లేని ఇలాంటి ఘర్షణల్లో తనకు జరిగిన ప్రాణ నష్టం వివరాలను చైనా ఎప్పుడూ వెంటనే బయటపెట్టదని, ఆ వివరాలను కొన్ని దశాబ్దాల తర్వాత వెల్లడిస్తుందని వివరించారు. 1962లో జరిగిన యుద్ధంలో తమ వైపున జరిగిన ప్రాణనష్టం వివరాలను 1994లో వెల్లడించిందని తెలిపారు. ఫ్రీప్రెస్ జర్నల్ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. గత 50 ఏళ్లలో భారత్, చైనా మధ్య అనేక ఘర్షణలు జరిగాయని, అయితే చైనా ప్రాణనష్టాలను దాచిపెడుతోందని తన కథనంలో వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/