అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా

జీజీహెచ్ సూపరింటిండెంట్ కు చంద్రబాబు ఫోన్

chandrababu

గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జీజీహెచ్ సూపరింటిండెంట్ కు ఫోన్ చేసి మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. అచ్చెన్న ఇదివరకే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా, కొన్నిరోజుల నుంచి గాయం నుంచి రక్తస్రావం ఆగడంలేదని చంద్రబాబుకు ఆయన వివరించారు. అందుకే మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అచ్చెన్నకు అత్యుత్తుమ వైద్యం అందించాలని చంద్రబాబు జీజీహెచ్ డాక్టర్లను కోరారు. అటు, అచ్చెన్నాయుడు సతీమణి విజయ మాధవి కూడా చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/