వైఎస్‌ఆర్‌సిపిని విమర్శించే అర్హత కన్నాకు లేదుః అంబటి

పట్టాభి విషయంలో టిడిపి దుష్ప్రచారం చేస్తోందన్న అంబటి

ambati rambabu
ambati rambabu

అమరావతిః పట్టాభి విషయంలో తమ ప్రభుత్వంపై టిడిపి పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పట్టాభి పాత ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపిని విమర్శించే అర్హత కన్నా లక్ష్మీనారాయణకు లేదని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం కన్నాది అని… బిజెపి వాసాలు లెక్క పెట్టిన తర్వాత ఆయన టిడిపిలో చేరారని చెప్పారు. టిడిపిలో చేరడం ద్వారా ఆయన నైతిక విలువలను కోల్పోయినట్టేనని అన్నారు. రాజకీయంగా కన్నా లక్ష్మీనారాయణ చనిపోయినట్టేనని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము సహించబోమని హెచ్చరించారు.