నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 141 పాయింట్లు కోల్పోయి 59,463కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు పతనమై 17,465 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.68 వద్ద కొనసాగుతుంది.