మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్ష

56వ రోజుకి చేరిన రైతులు నిరసనలు

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నేటికి ఆ ఆందోళనలు 56వ రోజుకి చేరాయి. మందడంలో రైతులు, మహిళలు మహా ధర్నాలో కూర్చున్నారు. అమరావతి పరిరక్షించాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు తుళ్లూరులోనూ రైతుల ధీక్షలు మొదలయ్యాయి. వెలగపూడి గ్రామస్థులు రిలే దీక్షలు చేపట్టారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షకు పూనుకున్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు యత్నిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/